Telangana

రాజశ్యామల యాగంతో కేసీఆర్‌ని ఆశీర్వదిస్తానని స్వరూపానంద!

kCR News : విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. మూడు రోజుల పాటు వైదిక నియమాలను పాటిస్తూ యాగం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు ముగిసింది. తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని ముఖ్యమంత్రి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పట్టం కట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

శాస్త్రోక్తంగా యాగం పూర్తి చేశామని స్వరూపానంద స్వామి స్పష్టం చేశారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని అంటున్నారు. మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో పలికిన జలాన్ని కేసీఆర్ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్ ముందు ఉంచారు.

యాగశాలలో శుక్రవారం రాజశ్యామల అమ్మవారు నర్తనకాళి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవన ప్రారంభమైంది. పూర్ణాహుతి ముహూర్త సమయానికి నిర్దిష్ట సంఖ్యలో హవనాలను పూర్తి చేశారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల సమక్షంలో పూర్ణాహుతిలో ఉపయోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు.

కూడా చదవండి  టీచర్ల పదోన్నతులు, బదిలీలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ అయితే అమలు ఎప్పటికి?

అష్టదిక్పాలకులకు అర్ఘ్యం సమర్పించారు. ఆ తర్వాత వాటిని దహనం చేశారు. కేసీఆర్ దంపతులు ధరించిన కంకణాలను విసిరివేసి యాగం పూర్తి చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి చిత్రపటానికి కేసీఆర్ పూలమాలలు వేసి గురు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్‌కు శూలినీ దుర్గా కవచం రక్ష కట్టారు. అలాగే విశాఖలోని శ్రీ శారదా పీఠం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను కేసీఆర్ దంపతులకు స్వరూపానందేంద్ర స్వామి బహూకరించారు. శుభసూచకంగా పండితులందరూ పసుపు వస్త్రాలు ధరించి యాగానికి హాజరయ్యారు

ఈ యాగానికి సందర్శకులకు అనుమతి లేదు. ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే పాల్గొన్నారు. గతం లో కేసీఆర్ ప్రజలను కూడా యాగాలు చేసేందుకు అనుమతించారు. ఈసారి ఎన్నికల కారణంగా ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది.

Source link

Related Articles

Back to top button