ఏపీలో ఏకంగా 57 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది
ఏపీలో 57 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఏకంగా 57 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. కొత్త కలెక్టర్లతో పాటు ఇతర ఐఏఎస్లను జిల్లాలకు బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల కలెక్టర్గా రంజిత్ భాషా, నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఎం హరినారాయణ, చిత్తూరు జిల్లా కలెక్టర్గా షాన్ మోహన్, బాపట్ల కలెక్టర్గా రంజిత్ భాషా, సత్యసాయి కలెక్టర్గా పి అరుణ్బాబు నియమితులయ్యారు. సీఎం సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా జి గణేష్ కుమార్ నియమితులయ్యారు.
కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ కార్యదర్శి హర్షవర్ధన్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, మున్సిపల్ డైరెక్టర్ కోటేశ్వరరావు, లేబర్ కమిషనర్ శేషగిరిబాబు, లేబర్ సెక్రటరీ హరిజవహర్ లాల్, పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె. విజయ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. విజయసునీత, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జె.వెంకటమురళి, జివిఎంసి కమిషనర్ సిఎం సైకత్ వర్మ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి వినోద్, ఎపి హెచ్ఆర్డి డిజి ఆర్పి సిసోడియా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి శ్రీధర్, ఎపి సౌరభ్గౌర్ భవన్ రెసిడెంట్ కమీషనర్గా హర్ష్వార్డ్ SAP MD, G. అనంతరాము మైనారిటీ సెల్ స్పెషల్ CS.
– చిత్తూరు జిల్లా కలెక్టర్గా షాన్మోహన్
– బాపట్ల కలెక్టర్గా రంజిత్ భాషా
– సత్యసాయి కలెక్టర్గా పి అరుణ్బాబు
– అనంతపురం కలెక్టర్గా పి గౌతమి
– విజయనగరం కలెక్టర్గా నాగలక్ష్మి
– కృష్ణా జిల్లా కలెక్టర్గా రాజబాబు
– కర్నూలు జిల్లా కలెక్టర్ గా సృష్టి
– వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్
– నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఎం హరినారాయణ